తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు మండలం కొత్తూరు వద్ద ఎదురెదురుగా వెళ్తున్న కారు, బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… భద్రాచలంకు చెందిన బీటెక్ విద్యార్థులు విహారయాత్రకు మోతు గూడెంకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు భద్రాచలంకు చెందిన నాగసాయి(20), పవన్(20) లు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.