యూపీ: యూపీ, ఉత్తరాఖండ్ సీఎంల ఎంపికపై కాసేపట్లో ఉత్కంఠకు తెర పడనుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సీఎం ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు మౌర్య సామాజిక వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్య సీఎం రేసులో ముందున్నారు. కేంద్ర టూరిజం శాఖా మంత్రి మహేష్ శర్మ, మరో కేంద్ర మంత్రి శ్రీకాంత్ శర్మ, ఎంపీ యోగి ఆదిత్యనాథ్ల పేర్లు కూడా వినిపిస్తున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్, కలరాజ్ మిశ్రా వంటి వారి పేర్లు తెరపైకి వస్తున్నా వీరి పట్ల ప్రధాని మోదీ సుమఖంగా లేరని తెలుస్తోంది.