హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. దయచేసి మూగజీవాల పట్ల జాగ్రత్త వహించండి అని సోషల్మీడియా వేదికగా కోహ్లీ పేర్కొన్నాడు. అంతకుముందు కోహ్లీ సీఐఎస్ఎఫ్పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇటీవల సీఐఎస్ఎఫ్ 48వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. ఈ నేపథ్యంలో తాను ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. నా విమాన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా జరిగేందుకు సహాయమందిస్తోన్న సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయానికి ఇవే నా ధన్యవాదాలు. జైహింద్ అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.