పేదరికం పై గెలుపు ఆదరణ 2 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బీసీలను అందుకున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ మాత్రమేనన్నారు. ఆదరణ పథకం కింద ఏడాదికి వెయ్యికోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. బీసీలు టీడీపీకి వెన్నెముక అని.. వారికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కలయికలో ముందుకెళ్తున్నామని.. చేతులు వృత్తులు, కుల వృత్తులను టెక్నాలజీతో కలిసి ఉత్పత్తి సాధించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని.. బ్రాండెడ్ వస్తువుల ఉత్పత్తి దిశగా మనం ముందుకువెళ్తే అభివృద్ధి అదే వస్తుందన్నారు. టీడీపీ పేదల పార్టీ అని ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందన్నారు. ప్రధాని మోడీ ఒట్టి మాటల మనిషి.. కోతల మనిషి మాత్రమే అన్నారు. రాష్ట్ర విభజన హామీలు కేంద్రం ఒకటి అమలు చేయలేదని.. అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలులో వెళ్తున్నామన్నారు. గ్రామాల్లో కరెంట్, సిసి రోడ్లు, మరుగుదొడ్లు అన్ని వసతులు కల్పించామని.. రెండెంకల వృద్ధి రేటు సాధించామన్నారు. 23 వేలకోట్లు ఖర్చుపెట్టి బీసీ సబ్ ప్లాన్ అమలుచేసి రికార్డ్ సృష్టించామని.. ఎన్నిసంక్షేమాలలో ఏపీ రాష్ట్రం ముందుందన్నారు. కేంద్రం మొండిచేయి ఇచ్చినా మనం దేశదేశాలు తిరిగి ఎంఓయూలు చేసుకొని రాష్ట్రంలో అభివృద్ధి బాటలో వెళ్తున్నామన్నారు.