ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి జిల్లాలో కచ్చిడి చేప,,,,మార్కెట్‌లో భారీగా డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 08:31 PM

ఇదేంటి ఒక్క చేప ధర రూ.లక్షల్లో ఉందని అవాక్కవుతున్నారా.. మీరు వింటున్నది నిజమే. గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచ్చిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. మార్కెట్‌లో భారీ ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లారు. వారికి ఈ కచ్చిడి చేప చిక్కింది.. వెంటనే మార్కెట్‌కు తీసుకురాగా.. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు.


చివరికి పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య దీన్ని రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ అరుదైన చేప ఏకంగా 27 కేజీల బరువు ఉందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు. కచ్చిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో తయారు చేస్తారని.. మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అందుకే మార్కెట్‌లో అంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com