కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పదో శక్తిపీఠం పాదగయ అర్చక నివాస గృహాల ప్రహరీ కూల్చివేతకు నిరసనగా బ్రాహ్మణ సేవా పరిషత్ , రాష్ట్ర అర్చక సమాఖ్య, పలు బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలయం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఆలయ అర్చకులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. అర్చక సంఘాలతో ఆర్జేసీ త్రినాధరావు, డీసీ రమేష బాబులు చర్చిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గోడ కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్ సృజన, ఈవో చలపతిరావులను సస్పెండ్ చేయాలని అర్చకులు డిమాండ్ చేశారు.