ఒక థియేటర్ నడిపే వ్యక్తి మత్స్యకారుల కుటుంబాలను అడ్డగోలుగా దోచుకుంటుంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ రోడ్లపై తిరుగుతారు కానీ… ప్రజల సమస్యలపై మాట్లాడరని విమర్శించారు. కాకినాడ సీపోర్ట్ కేవీరావును ఇండియాకు రప్పించాలన్నారు. సెజ్లపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సెజ్లను రద్దు చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఎక్కడా చూసినా ఇసుక దోపిడీ జరుగుతోందని అన్నారు. కాకినాడ హోప్ ఐలాండ్ అన్యాక్రాంతంపై ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాక్స్లు కట్టకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.