న్యూఢిల్లీ : వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర .15 పైసలు తగ్గి రూ. 77.28కు చేరుకోగా, డీజిల్ ధర 10 పైసలు తగ్గి రూ. 72.09కు చేరింది. కాగా, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 54కు తగ్గింది. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ. 78.32 కు పడిపోయింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.80, డీజీల్ ధర రూ.75.53గా ఉంది.