కడప : జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని జమ్మలమడుగులో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వీరనాల శివనారాయణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు వినయ్ కుమార్, సిపిఎం జమ్మలమడుగు నాయకులు బాలాజీ, వేపరాల లక్మి నారాయణ, మునిరెడ్డి, డివైఎఫ్ఐ జమ్మలమడుగు నాయకులు మహేష్, నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్, పవన్ కళ్యాణ్లు పాల్గొన్నారు.