శ్రీకాకుళం: శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి మున్సిపల్ మైదానంలో సోమవారం పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆదరణ-2 యూనిట్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.