ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ మెషిన్ ను ప్రారంభించిన మంత్రి డా.కామినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 11:55 AM

విజయవాడ   ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ మెషిన్ పీపీపీ విధానంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.ప్రభుత్వ  ఆసుపత్రిలో అన్ని స్కానింగ్ పరిక్షలు ఉచితంగా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సీటీ స్కాన్ మెషిన్లు పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్నం.త్వరలో  మరో మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో సీటీ స్కాన్ మెషిన్లు ప్రారంభిస్తాం.త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులలో MRI స్కాన్ కూడ ఏర్పాటు చేస్తాం.విజయవాడ  ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఓపి 1500 ఉండగా ప్రస్తుతం 2500 కు పెరిగింది. మరియు ప్రభుత్వ  ఆసుపత్రిలో బయోమెట్రిక్ పెట్టడంవల్ల డాక్టర్ల అటెండెన్స్ పెరిగింది. అలాగే ప్రభుత్వ  ఆసుపత్రులలో ప్రసవాలు గతంలో కన్న ఇప్పుడు బాగా పెరిగాయి. ఇంకా ప్రభుత్వ  ఆసుపత్రులలో ప్రసవించిన వారికి రూ.1,000, బేబికిట్స్, జననా ద్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, తల్లిబిడ్డ ఎక్స్ ప్రైస్ తో పాటు త్వరలో మదర్ కిట్ ఇస్తునాము. అని  మరియు రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ ఆసుపత్రులకు బాలింతలకు పౌష్టికాహారం అందడంలేదన్న వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు.దీనిపై  దర్యప్తు చేసి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటాము అని  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ తెలిపారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com