కొత్త పార్లమెంటు కేవలం కొత్త భవనం మాత్రమే కాదు, కొత్త ప్రారంభానికి చిహ్నం అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నారిశక్తి వందన్ అధినియంకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులను కోరారు. కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి సమావేశంలో రాజ్యసభలో మాట్లాడిన ప్రధాన మంత్రి, ఈ సందర్భం చారిత్రకమని, చిరస్మరనీయమని వ్యాఖ్యానించారు.రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాలను ఆయన నొక్కిచెప్పారు, పార్లమెంటు ఎగువ సభ రాజకీయ చర్చల ప్రవాహానికి మించి తీవ్రమైన మేధోపరమైన చర్చలకు కేంద్రంగా మారుతుంది. పార్లమెంటు కేవలం శాసన సభ మాత్రమే కాదని, చర్చా వేదిక అని మాజీ రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ను ఉటంకిస్తూ ప్రధాని అన్నారు. రాజ్యసభలో నాణ్యమైన చర్చలు వినడం ఎప్పుడూ ఆనందదాయకమని అన్నారు.