వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూశారు. ఈ ఉదయం 10.05 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత పది రోజులుగా వియత్నాం రాజధాని హనోయ్ లోని సైనిక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి, ఈ ఉదయం ఆయన మృతి చెందినట్టు మిలిటరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. క్వాగ్ వయసు 61 సంవత్సరాలు. 2016 ఏప్రిల్ 2 నుంచి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాజీ అధ్యక్షుడు తాన్ సాంగ్ ఆయన పేరును ప్రతిపాదించగా... వియత్నాం పార్లమెంటు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్షుడు కాకముందు ఆయన దేశ ప్రజాభద్రత మంత్రిగా పని చేశారు.