అనంతపురం : కత్తి పదును పెట్టుకుని తన నాలుక కోయడానికి సిఐ మాధవ్ సిద్దంగా ఉండాలని ఎంపి జెసి దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఈ నెల 25 వరకూ జిల్లాలోనే ఉంటానని ఎక్కడకు రావాలో, ఎక్కడ నాలుక కోస్తాడో సిఐ చెబితే అక్కడికి తానే వెళతానని జెసి అన్నారు. రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అని ఆయన అన్నారు. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, సిఐ మాధవ్పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంఘాలు పని చేయడం లేదన్నారు. ఇంత పౌరుషమున్న పోలీసులు దాడులు జరిగినప్పుడు ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు.