హార్యానా: రేవారిలో ఇటీవల సీబీఎస్ఈ టాపర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్చించేందుకు 51 గ్రామాలకు చెందిన మహా పంచాయత్ నేడు సమావేశమైంది. ఈ సందర్భంగా జన్ సంఘర్ష్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రేవారి గ్యాంగ్ రేప్ బాధితురాలికి న్యాయం జరిగే విషయంలో తోడ్పాటునందించనుంది. అదేవిధంగా భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతి కాకుండా పాటుపడనున్నట్లు పంచాయత్ పెద్దలు పేర్కొన్నారు.