విజయవాడ నగరంలో ఉన్న ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్లో పలు సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు వసతి గదిలోకి రావడం, హాస్టల్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా నీరు నిలిచిపోవడంతో విద్యార్థుల వర్షపునీరు లోనే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా కబేలా హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) సంక్షేమాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.