లోక్సభలో మంత్రులు వివిధ పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం లోక్సభ సెక్రటరీ జనరల్ రాజ్యసభనుంచి వచ్చిన సందేశాలను సభకు సమర్పించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తక్కువ సమయం కేటాయించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యకత్ం చేసింది. ఈ విషయాన్ని స్పీకర్ కు తెలియజేస్తూ కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అవసరమైతే అవిశ్వాసంపై చర్చను రెండు మూడు రోజులు సాగిద్దామన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ సమిత్రా మహాజన్ భోజన విరామం తీసుకోకుండా చర్చను కొనసాగిద్దామని ప్రతిపాదించారు. సాయంత్రం ఆరుగంటల వరకూ చర్చ సాగుతుందని, అందరూ ప్రశాంతంగా పాల్గొనాలని కోరారు.