న్యూఢిల్లీ : తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన లోక్ సభకు చేరుకున్నారు. తెలుగుదేశం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్ సభకు హాజరౌతానని శివప్రసాద్ పేర్కొని ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినా సున్నితంగా నిరాకరించి రెగ్యులర్ విమానంలోనే ఢిల్లీ చేరుకున్నారు. కాగా ఆరోగ్యం బాలేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం లోక్ సభకు వచ్చిన శివప్రసాద్ ను చంద్రబాబు అభినందించారు.