ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు పోలవరానికి కేంద్రమంత్రి గడ్కరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 11, 2018, 11:55 AM

 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్నారు. కేంద్రమంత్రితో పాటు సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతాన్ని వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం చేరుకుని రెండు గంటల పర్యటన అనంతరం సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళతారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..చంద్రబాబుతో కలిసి ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్నారు. తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలతోనూ, అధికారులతోనూ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. దాదాపు పది నెలల తర్వాత గడ్కరీ రెండో సారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. గడ్కరీ పర్యటన వలన ప్రాజెక్టు పనులు వేగంగా సాగడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com