అమరావతి: ఢిల్లిలో నిన్నటి నీతి అయోగ్ భేటీలో ఏపీ వృద్ధిని దేశం దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ మన రాష్ట్రంలో జల సంరక్షణ, పంట మార్పిడి, పండ్లతోటల వృద్ధిపై ప్రజంటేషన్ ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విధానాలు జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారాయని పేర్కొన్నారు.