హైదరాబాద్ : వచ్చే ఎన్నికలలో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఈ పార్టీ అధికార ప్రతినిథి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన 2019 ఎన్నికలలో వైకాపా అధికారంలోనికి రావడం ఖాయమని ఆయన చెప్పారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం నానా కుట్రలూ చేస్తున్నదని, వైకాపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. పీఏసీ చైర్మన్ బొగ్గన ఎవరినో కలిశారంటూ ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకు సాక్ష్యంగా చూపుతున్న లాగ్ బుక్ అంతా ట్యాంపరింగ్ మయం అని బొత్స సత్యనారాయణ అన్నారు.