తిరుపతి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి అన్నారు. చంద్రగిరిలో వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని ఆయన చెప్పారు. మొదటినుంచి హోదా కోసం వైకాపాయే పోరాడుతోందని ఆయన చెప్పారు. హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందన్నారు.