చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు నిఫా కేసు నమోదు కాలేదని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. నిఫా వైరస్ కలకలంపై స్పందించిన కలెక్టర్ ప్రద్యుమ్న కేరళ నుంచి వచ్చిన మహిళా వైద్యురాలిని రుయా ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం సూచన మేరకు ఆమెను 5 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. వైద్య పరీక్షల అనంతరం మహిళా వైద్యురాలికి నిఫా వైరస్ లేదని వైద్యులు తేల్చారని పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.