ఓ జవాన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మూకశ్మీర్లోని గండర్బల్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుంది. 24వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన హవాల్దర్ రాజ్పాల్ సింగ్ తన తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జవాన్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాటు పూర్తిచేస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.