విజయవాడ: ఏపీ రాజధాని అమరావతికి మరో నగరం సాటి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో మూడో రోజు జరుగుతున్న మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నామన్నారు. రాజధాని కోసం జగన్ అడిగితే సెంటు భూమిని కూడా రైతులిచ్చేవారు కాదని, టీడీపీపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ విశ్వసనీయతకు ఇదే నిదర్శనమన్నారు.