కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ రోజు 159వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జగన్ తన 159వ రోజు పాదయాత్రను గన్నవరం క్రాస్ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర మండవల్లి, చిగురుకోట క్రాస్, భైరవపట్నం, చావలిపాడు మీదుగా కైకలూరు వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా గాంధీబొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.