ఉత్తరాఖండ్ : చార్ధామ్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వాతావరణం అనుకూలించడంతో చార్ధామ్నుంచి యాత్రికులు వాహనాల్లో బయలుదేరారు. జడ్పీ ఛైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో 39 మంది యాత్రికుల బృందం రిషికేష్నుంచి బయలుదేరారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా 104 మంది తెలుగు యాత్రికులు చార్ధామ్లో చిక్కుకుపోయారు. ఎంపి రామ్మోహన్ నాయుడు యాత్రికులతో ఫోన్లో మాట్లాడారు. ఎపి అదనపు కమిషనర్, టిడిపి పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.