చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా శంఖంపల్లెలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమిళనాడులోని అత్తూరు వాసులు. తమిళనాడు నుంచి తిరుమలకు వస్తుండగా ప్రమాదం భారిన పడ్డారు.