తిరుమల టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. శ్రీవారి ఆళయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణస్వీకారోత్సం నిర్వహించారు. టీటీడీ 47వ చైర్మన్గా పుట్టా సుధాకర్యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు పాలకమండలి సభ్యులుగా బోండా ఉమా, చల్లా రామచంద్రారెడ్డి, మేడ రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, బీకే పార్థసారధి, రుద్రరాజు, రాయపాటి, డొక్కా జగన్నాథం, రమేష్ బాబు, శివాజీ ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా మన్మోహన్ సింగ్, అనురాధ, అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణం స్వీకారం చేశారు.