ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న సమ్మె నేడు మూడవ రోజుకు చేరుకుంది. ఒక సీనియర్ డాక్టర్ తన వద్ద పని చేస్తున్న రెసిడెంట్ డాక్టర్ను రోగుల ఎదుట కొట్టడంతో డాక్టర్లు సమ్మెబాట పట్టారు. దీనితో ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ ఆపరేషన్లను రద్దు చేశారు. ఔట్ పేషెంట్ విభాగానికి వస్తున్న రోగులను తిప్పి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ, ఐసియు సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా ఆసుపత్రి అధికారుల సూచనల మేరకు సీనియర్ డాక్టర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పి సెలవుపై వెళ్లిపోయారు.