ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక ఎన్నికల్లో ఓటేయాలని ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 28, 2018, 09:18 AM

 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది… తమతమ వ్యూహాలకు పదునుపెడుతూ రాజకీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. అయితే కర్నాటక ఎన్నికల్లో తను ఓటేయాలని ఉందని… కానీ, తాను రాలేని పరిస్థితి ఉందన్నారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా… నిన్న కోర్టుకు హాజరైన సందర్భంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనాలని ఉన్నప్పటికీ… తాను భారత్‌కు రాలేని స్థితిలో ఉన్నానని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటెయ్యడం నా ప్రాథమిక విధి… కానీ, మీకు తెలుసు నేను భారత్‌కు వెళ్లలేనని అన్నారాయన.


అయితే కర్ణాటక ఎన్నికలపై స్పందించడానికి నిరాకరించాడు విజయ్ మాల్యా… కర్ణాటక ఎన్నికలపై మీ అభిప్రాయమేమిటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రస్తుతం రాజకీయ అంశాలను నేను పెద్దగా పట్టించుకోవడం లేదు… అందువల్ల ఈ ఎన్నికలపై నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదన్నారు. కాగా, కర్ణాటక నుంచి రెండు సార్లు రాజ్యసభకు విజయ్‌ మాల్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక భారత్‌లోని బ్యాంకులకు రూ.9000 కోట్ల మేర రుణాలను ఎగవేసి మాల్యా… ప్రస్తుతం మనీ లాండరింగ్‌ కేసులను ఎదుర్కొంటున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com