అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనంద వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనం వివేకా కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకానందరెడ్డి ప్రొస్ట్రేట్ క్యాన్సర్ తో మరణించారని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆనం వివేకానంద ఏప్రిల్ 13న కిమ్స్ ఆసుపత్రిలో చేరారని, ఆయనకు ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ఉందని నిర్ధారించి చికిత్స అందించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.