రాజస్థాన్: రేప్ కేసులో ఆశారాం బాపుని దోషిగా తేల్చిన జోధ్పూర్ కొర్టు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆశారాంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోఆశారాంబాపుతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్థారించి, మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా కోర్టు తీర్పు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నాలుగు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు.