న్యూఢిల్లి : దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయిలు జమ చేస్తామని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదని కేంద్ర సమాచార కమిషన్కు పిఎంఒ తెలిపింది. మోహన్ కుమార్ శర్మ అనే ఆర్టీఐ కార్యకర్త 2016 నవంబర్లో ఈ అంశంపై ఆర్టీఐలో పిటిషన్ దాఖలు చేశారు.