ప్రకాశం జిల్లాలో బ్యాంకులు, ఎటిఎంలలో నగదు లేక పోవడాన్ని నిరసిస్తు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్యాంకులు ఎటిఎంల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు ఎటిఎంలలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారాన్నారు. కేంద్ర ప్రభత్వం వెంటనే ఎటిఎంలలో డబ్బును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఎన్.సీతారాంజనేయులు, కనిగిరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పాశం వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.