-జిల్లాల వారీగా లక్కీ డీప్ ద్వారా నగదు పురస్కారం
-మండలాల వారీగా ఉచితంగా 15వేల స్మార్ట ఫోన్లు
-ఉగాదికి కార్డుదారులకు కిలో పంచదార పంపిణీ
-బలవంతంగా కాదు అవగాహనతో నగదు రహితం
-ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత
విజయవాడ, మేజర్న్యూస్ : చౌకధరలు దుకాణాలలో నగదు రహిత లావాదేవీ లు ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా ద్వారా లక్ష నగదు బహమతులు జిల్లాలా వారీగా అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని ఆమె మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా నగదు రహితంగా రేషన్ సరుకులను తీసుకున్న మొత్తం కార్డుదారులలో లక్కీ డీప్ ద్వారా ప్రతిజిల్లాకు ఒకరిని ఎంపిక చేసి, వారికి రూ. లక్ష నగదు బహుమతిని మూడు నెలలు పాటు అందజేస్తామని చెప్పారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి ఖాతాలు కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా కృష్ణాజిల్లాలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 1న రాష్టవ్య్రాప్తంగా 3 లక్షల,15 వేల కారు ్డదారులకు రేషన్ పంపిణీ అయ్యిందని, వారిలో 1 లక్షా, 50 వేల మంది నగదు రహితంగానూ, 1లక్షా,65వేల మంది నగదుతో రేషన్ తీసుకున్నట్లు తెలిపారు. నగదు రహితాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు నెలకు 5వేల మొబైల్ ఫోన్ల(స్మార్ట) చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలలకు 15 వేల మొబైల్స బహు మతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలను చైతన్యవంతులను చేసి, నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. ప్రజలను బలవంతంగా కాకుండా, వారికి అవగాహన కల్పించి వారి సహకారం తోనే వంద శాతం నగదు రహిత లావాదేవీలను చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్య మన్నారు. కచ్చితంగా నగదు రహితంగానే సరుకులు తీసుకోవాలనే నిబంధనైతే లేదన్నారు.
2016 డిసెంబర్ నుంచి రేషన్ షాపులలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించామన్నారు. ఫిబ్రవరిలో రేషన్ షాపులలో సరుకులు తీసుకున్న మొత్తం కార్డుదారులలో 12 శాతం మంది నగదు రహితంగా తీసుకున్నారని చెప్పారు. ఏపీని నూరు శాతం ఎల్పీజీగా చేయడమే ముఖ్య మంత్రి లక్ష్యమని ఆమె చెప్పారు. షెడ్యూల్ కులాల వారికి ఎల్పీజీ సదుపాయం కల్పించేందుకు ఎస్సీ సబ్ప్లాన్ నుంచి రూ.30కోట్ల,58లక్షల నిధులను దీపం పథకం కోసం విడుదల చేసినట్లు తెలిపారు.
ఏజెన్సీల్లో నివసించే గిరిజనులకు ట్రైబల్ ప్యాకేజ్ ద్వారా 5కిలోల గ్యాస్ పంపిణీ చేయడానికి రూ. 16 కోట్ల, 22 లక్షల నిధులు దీపం పథకం ద్వారా సీఎం మంజూరు చేశారని చెప్పారు. గ్రామీణ నిరుపేద మహిలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం చంద్ర బాబు చొరవ చూపి నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఉగాది కానుకగా రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ఎప్పుడూ ఇచ్చే అర కిలో చెక్కరకు అద నంగా మరో అర కిలో చెక్కర ఇస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని డీలర్లు గమనించాలని, కిలో పంచదార ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి సునీత హెచ్చరించారు.