విజయవాడ, సూర్య బ్యూరో : ఎంఎస్ సుబ్బలక్ష్మి శతజయంతి సందర్భంగా స్వరాంజలి ప్రత్యేక కార్యక్రమం సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు వారి ఆధ్వర్యంలో స్వర్ణాంజలి కార్యక్రమాన్ని మార్చి 2, 3 తేదీ ల్లో నిర్వహించనున్నట్టు డైరెక్టర్ డి. విజయ్ భాస్కర్ ఓ ప్రకట నలో తెలిపారు. భారతరత్న, సంగీత నాటక అకాడెమీ అవార్డుగ్రహీత ఎం. ఎస్. సుబ్బలక్ష్మి శతజయంతి సందర్భంగా రెండు రోజులపాటు విజయ వాడ ఘంటసాల సంగీత, నత్య కళాశాల వేదికపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశా మని ఆయన వివరించారు. మార్చి 2 తేదీ గురువారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తమిళనాడుకు చెందిన కర్ణాటక వయలిన్ విద్వాంసుడు ఎంబర్ ఎస్ కన్నణ్తో ప్రత్యేక కార్యక్రమం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు చెందిన పేరవలి జయభాస్కర్తో తాల్ వాద్య కచేరి కార్యక్రమం, తమిళనాడుకు చెందిన కర్ణాటక గాత్ర విద్వాంసులు షెర్టాలయ్ రంగనాథశర్మతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి శతజయంతి రెండో రోజు మార్చి 3 శు్ర వారం సాయంత్రం ఐదున్నర గంటలకు తమిళనాడుకు చెందిన నాగస్వ రం కళాకారుడు ఎ. విజయ్ కార్తికేయన్తో కార్యక్రమం, కేరళకు చెందిన మృదం గం విద్వాంసుడు కేవీ ప్రసాద్, కర్ణాటక గాత్ర విద్వాం సులు నైవేలీ శాంత గోపాలన్తో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సాంస్కృతిక శాఖ సంచా లకులు డి. విజయ్ భాస్కర్ పేర్కొన్నారు.