ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వామపక్ష నేతలతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 09:43 AM

ప్రత్యేకహోదా ఉద్యమం జోరు పెంచడానికి ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ నడుంబిగించారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకోనున్న పవన్‌ కల్యాణ్ వామపక్ష పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. హోదాపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్, పోరాటానికి వెనుకడుగేసేది లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన భావసారూప్య పార్టీలతో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీంతో నేడు వామపక్ష పార్టీలతో సమావేశానంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com