బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీకి శివసేన సిద్ధమైంది. 50 నుంచి 55 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ నిన్న ప్రకటించారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని భావించిన శివసేన.. మరాఠీ ప్రజలు ఉన్న ప్రాంతాల్లోనే అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీ అయిన మహారాష్ట్ర ఏకీకరణ సమితికి మద్దతిచ్చే అవకాశాలున్నాయని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మే 12న కర్ణాటక శాసనసభకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. మే 15న ఫలితాలు వెలువడున్నాయి.