తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు అన్ని కంపార్ట్ మెంట్లలో నిండి బయట కిలోమీటరు మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినకడన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 53,527 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లుగా ఉంది.