అమరావతి : జాతీయ పార్టీ నాయకత్వానికి హుందాతనం లేకుండా పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కల్చర్ మారిపోయిందన్నారు. నాయకత్వానికి హుందాతనం లేకుండా పోయిందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వాస్తవ గణాంకాలు వివరించి బీజేపీ ద్రోహాన్ని, మోసాన్ని బట్టబయలు చేయాలన్నారు. మనను విమర్శించనంత వరకూ విమర్శల జోలికి పోవలసిన అవసరం లేదని అన్నారు.