ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 09:36 AM

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ ఎంపీలు, అసెంబ్లి వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం, నేటి పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలతో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. అన్నిపార్టీల ఫ్లోర్ లీడర్లతో సమన్వయం చేసుకుని అవిశ్వాసంపై చర్చ జరిగేలా సహకరించాల్సిందిగా కోరాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు. తెరాస, అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడి అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వచ్చేలా సహకరించాలని కోరాలని ఆయన చెప్పారు. తాను కూడా అన్ని పార్టీలనూ అవివ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరతానని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com