ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు ప్రమాదం ఘటన కలచివేసింది : పవన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 07:15 PM

హైదరాబాద్‌ : కృష్ణాజిల్లా మూలపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వంతెనపై నుంచి కల్వర్టులోకి పడటం చూస్తుంటే నోటమాట రావడం లేదని మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని పవన్‌ సూచించారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్‌ కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com