శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణస్వామిని చివరి రోజు కూడా సూర్యకిరణాలు తాకలేదు. మూడు రోజులుగా మేఘాలు అడ్డురావడంతో సూర్యకిరణాలు తాకలేదు. ఏటా మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్యనారాయణస్వామిని కిరణాలు తాకుతున్నాయి. ఉత్తరాయణం, దక్షిణాయణంలో మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నది. మళ్లీ అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు తాకే అవకాశం ఉంది. సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులంతా నిరాశతో వెనుదిరిగారు.