అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. సీఎం నివాసం ప్రజాదర్బార్ హాలులో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రివర్గ సమావేశానికి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు గైర్హాజరయ్యారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2లక్షల కోట్లతో 2018-19 వార్షిక బడ్జెట్ను రూపొందించారు. బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించి ఆన్లైన్లో గవర్నర్కు పంపింది.