అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పార్లమెంటు సభ్యుడు సిఎం రమేశ్ అన్నారు. వైకాపా ఎంపిల రాజీనామాకు జగన్ ఎందుకు గడువు విధించారని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగమేమీ ఉండదని, అది చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని ఆయన అన్నారు.