న్యూయార్క్: ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ దాదాపు రూ. 3142 కోట్ల విలువైన ఫేస్బుక్ షేర్లను అమ్మేశాడు. అయితే.. ఆయన ఆ షేర్లను అమ్మేసింది మాత్రం ఓ ఆర్గనైజేషన్ కోసం. అవును. చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్(సీజెడ్ఐ) అనే సంస్థ కోసం షేర్లను అమ్మేశాడు. ఈ సంస్థను మార్క్, అతడి భార్య ప్రిస్కిల్లా చాన్ కలిసి డిసెంబర్ 2015లో స్థాపించారు. ఒక బిలియన్ డాలర్ల ఫేస్బుక్ షేర్ల పెట్టుబడితో ఈ సంస్థను రన్ చేస్తున్నారు. తాజాగా ఈ ఆర్గనైజేషన్ కోసమే జుకర్బర్గ్ ఫేస్బుక్ షేర్లను అమ్మేశాడట. గత నెల ఫిబ్రవరిలో 482.2 మిలియన్ డాలర్ల విలువైన 2.7 మిలియన్ షేర్లను జుకర్ బర్గ్ అమ్మేశాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 3142 కోట్లు. దాదాపు 35 నుంచి 75 మిలియన్ ఫేస్బుక్ షేర్లను వచ్చే 18 నెలల్లో అమ్మేస్తున్నట్లు గత సంవత్సరం సెప్టెంబర్లోనే మార్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు... 99 శాతం ఫేస్బుక్ షేర్లను కూడా అమ్మేసి ఈ సంస్థ కోసం కేటాయించనున్నట్లు మార్క్ ప్రకటించాడు.