రాజమహేంద్రవరం : మోరంపూడిలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నూతన భవనాన్ని మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపి మురళీమోహన్, ఎసిబి డైరెక్టర్ జనరల్ ఠాకూర్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.