వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 99వ రోజుకు చేరుకుంది. జగన్ తన 99వ రోజు పాదయాత్రను ప్రకాశం జిల్లా కాటూరువారిపాలెం నుంచి ప్రారంభించారు. పాదయాత్ర అగ్రహారం క్రాస్, తలమళ్ల, ఫిరదోసినగర్, గోగినేనిపాలెం క్రాస్ మీదుగా ఉప్పలపాడు వరకు కొనసాగనుంది.