అనంతపురం : మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 నాటికి రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, ఇప్పటికే 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందన్నారు. పదేళ్లలో రాయదుర్గాన్ని ప్రగతి దుర్గంగా మారుస్తామని తెలిపారు. బీటీ ప్రాజెక్టుకు నీరు సాధ్యం కాదన్నారు కానీ..అందరినీ ఒప్పించి మరీ దానిని సాధించామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో శాశ్వతంగా కరవును పారద్రోలుతామని, కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇందుకు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.